అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్య పఠనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సీహెచ్. కేశవరావు అధ్యక్షత వహించారు. మాతృభాషపై పట్టు ఉంటే ఇతర భాషలను సులభంగా నేర్చుకోవచ్చన్నారు. అధ్యాపకుడు ఎస్. సోంబాబు పోటీలను పర్యవేక్షించారు. విజేతలకు ఆగస్టు 29న బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కే నిర్మల ఎన్ఎస్ఎస్ పిఓలు విజయలక్ష్మి, అనితకుమారి, అధ్యాపకులు వి కామేశ్వరరావు, ఎస్ఎ దొన్ను, ఎస్ సురేష్, విద్యార్ధిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అరకు: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్య పఠనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సీహెచ్. కేశవరావు అధ్యక్షత వహించారు. మాతృభాషపై పట్టు ఉంటే ఇతర భాషలను సులభంగా నేర్చుకోవచ్చన్నారు. అధ్యాపకుడు ఎస్. సోంబాబు పోటీలను పర్యవేక్షించారు. విజేతలకు ఆగస్టు 29న బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కే నిర్మల ఎన్ఎస్ఎస్ పిఓలు విజయలక్ష్మి, అనితకుమారి, అధ్యాపకులు వి కామేశ్వరరావు, ఎస్ఎ దొన్ను, ఎస్ సురేష్, విద్యార్ధిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

