Tuesday, 18 August 2026
  • Home  
  • అధ్వాన రహదారితో అవస్థలు.. యాచారం–నందివనపర్తి రోడ్డుకు మరమ్మతులు చేయాలి
- రంగారెడ్డి

అధ్వాన రహదారితో అవస్థలు.. యాచారం–నందివనపర్తి రోడ్డుకు మరమ్మతులు చేయాలి

యాచారం–నందివనపర్తి రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి రోడ్డు దుస్థితికి మోక్షమెప్పుడో..? ఎమ్మెల్యేను ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు అధ్వాన రహదారితో అవస్థలు.. యాచారం–నందివనపర్తి రోడ్డుకు మరమ్మతులు చేయాలి యాచారం: యాచారం మండలం నుంచి నందివనపర్తికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగం యాచారం మండలాధ్యక్షుడు జానీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ.. యాచారం–నందివనపర్తి మధ్య ఉన్న ప్రధాన రహదారి చాలా కాలంగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని తెలిపారు. రహదారిపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచి రహదారి ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈ రహదారిపై నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో ప్రయాణ సమయం పెరగడంతో పాటు వాహనాలు దెబ్బతింటున్నాయని, చిన్నపాటి ప్రమాదాలు కూడా చోటుచేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా గుంతలను పూడ్చడంతో పాటు, శాశ్వత పరిష్కారంగా నాణ్యమైన రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని జానీ ఎమ్మెల్యేను కోరారు. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించి, భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ప్రజల సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి రోడ్డు పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, అవసరమైన మరమ్మతులు మరియు అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు జానీ తెలిపారు. రోడ్డు సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

యాచారం–నందివనపర్తి రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

రోడ్డు దుస్థితికి మోక్షమెప్పుడో..? ఎమ్మెల్యేను ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు

అధ్వాన రహదారితో అవస్థలు.. యాచారం–నందివనపర్తి రోడ్డుకు మరమ్మతులు చేయాలి

యాచారం: యాచారం మండలం నుంచి నందివనపర్తికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగం యాచారం మండలాధ్యక్షుడు జానీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ.. యాచారం–నందివనపర్తి మధ్య ఉన్న ప్రధాన రహదారి చాలా కాలంగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని తెలిపారు. రహదారిపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచి రహదారి ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

ఈ రహదారిపై నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో ప్రయాణ సమయం పెరగడంతో పాటు వాహనాలు దెబ్బతింటున్నాయని, చిన్నపాటి ప్రమాదాలు కూడా చోటుచేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా గుంతలను పూడ్చడంతో పాటు, శాశ్వత పరిష్కారంగా నాణ్యమైన రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని జానీ ఎమ్మెల్యేను కోరారు. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించి, భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ప్రజల సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి రోడ్డు పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, అవసరమైన మరమ్మతులు మరియు అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు జానీ తెలిపారు. రోడ్డు సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.