హెచ్ఐవి నివారణ పద్ధతులను ప్రతి ఒక్కరూ పాటించాలి
జిల్లా కేంద్రమైన కాకినాడలో బీమాభాయి మహిళా మండలి ఆధ్వర్యంలో మండల స్థాయి ఫెడరేషన్ ల సభ్యులకు మరియు గ్రామ సమాఖ్య సభ్యులకు కౌన్సిలింగ్ నైపుణ్యాలు మరియు హెచ్ఐవి నివారణ పద్ధతులను గురించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ హెచ్ఐవి నివారణ పద్ధతులను ప్రతి ఒక్కరూ పాటించాలని,ఆ విధంగా చేయడం ద్వారా హెచ్ఐవి రహిత సమాజాన్ని నిర్మించవచ్చునన్నారు. హెల్త్ ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ కౌన్సిలింగ్ నైపుణ్యాలను గురించి వివరిస్తూ ఓపికగా వినడం, స్పందించడం, ప్రశ్నించడం,సారాంశం చెప్పడం,సహానుభూతి చూపించడం వంటి నైపుణ్యాలు కలిగి ఉండడం అవసరమన్నారు. మండల స్థాయి ఇంప్లిమెంటరు కే శివశంకర్ మాట్లాడుతూ కౌన్సిలింగ్ అనేది మానసిక, భావోద్వేగ లేదా వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు కౌన్సిలర్ అని పిలవబడే నిపుణుడి ద్వారా లభించే వృత్తిపరమైన మార్గదర్శకత్వం మరియు మద్దతు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని సభ్యులు మరియు బీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

