విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల
*రాజంపేట పట్టణం మన్నూరులో ఈరోజు 17-08-2026వ తేది సోమవారం నాడు శ్రీశ్రీశ్రీ గోదా మహాలక్ష్మి శ్రీ ఐరావత వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మాజీ ఎమ్మెల్సీ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.*
*ఈ సందర్భంగా వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.*
*అనంతరం అక్కడ నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి కూర్చుని కల్యాణాన్ని వీక్షించారు……….., ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు మరియు పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*


