జనగామ,సెప్టెంబర్ 8,పున్నమి జిల్లా ప్రతినిధి :
భారతీయ జనతా పార్టీ విద్యార్థుల ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని చలో అసెంబ్లీ ముట్టడి కి రాష్ట్ర అధ్యక్షులు రామచందరావు గారి పిలుపు మేరకు జనగాం జిల్లా అధ్యక్షులు సౌడా రమేష్ గారి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లిన బిజెపి నాయకులు అసెంబ్లీ ముట్టడి లో భాగంగా జనగాం జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారికి తీవ్రంగా గాయాలు కావడం జరిగింది.వారిని హైదరాబాద్ లోని స్థానిక శ్రీకర హాస్పిటల్ -లక్డీకపూల్ లో చేర్పించడం జరిగింది.బీజేపి రాష్ట్ర నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డి(KSR) హరీష్ రంజిత్ పెద్దోజు జగదీష్ హాస్పిటల్ లో డాక్టర్ ని అడిగి వివరాలు తెలుసుకొని సాధారణ స్థితి వచ్చేవరకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అని తెలిపారు


