తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు. ఇప్పటికే నోటీసుకు వివరణ ఇచ్చినప్పటికీ తనపై బహిరంగ విమర్శలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో తన రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయడం కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నమా అనే అంశాన్ని పరిశీలించాలని కోరారు. పార్టీ క్రమశిక్షణ, సామాజిక న్యాయం, మహిళల గౌరవానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సురేఖపై వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు?
తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు. ఇప్పటికే నోటీసుకు వివరణ ఇచ్చినప్పటికీ తనపై బహిరంగ విమర్శలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో తన రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయడం కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నమా అనే అంశాన్ని పరిశీలించాలని కోరారు. పార్టీ క్రమశిక్షణ, సామాజిక న్యాయం, మహిళల గౌరవానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

