ఆదివారం ఆర్మూర్ పట్టణంలో శ్రీ బాలాజీ జండా జాతరలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దయతో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని వేడుకున్నారు. ప్రజలందరికీ శ్రీ బాలాజీ జండా జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయనను సర్వ సమాజ్ అధ్యక్షులు కొట్టాల సుమన్ కార్యవర్గం సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, నూకల శేఖర్, కేవీ రమణ, వినోద్, దినేష్, బ్యాంకు నవీన్, నారా గౌడ్, విట్టోబ, శేఖర్, కర్తన్ నవీన్, గంగ మోహన్, తదితరులు పాల్గొన్నారు.



