వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 332 ఇళ్లను తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు మరియు రౌడీషీటర్ల కదలికలను గుర్తించారు. సరైన పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గుర్తించిన వ్యక్తులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ప్రజల భద్రతతో పాటు మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పిస్తూ, ఇలాంటి తనిఖీలు తరచుగా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.



