గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ప్రముఖ రైతు నాయకుడు ఎర్ర నారాయణగౌడ్, బాలమణి దంపతుల కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించిన తోట ఆగన్న గారు, వధూవరులు ఆనందంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి గారు, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారు పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు. గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేశారు.



