*విద్యార్థులకు ఉచిత బ్లడ్ గ్రూప్ పరీక్షలు,*
,రెండు హైస్కూళ్లలో 250 మంది విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ కార్డుల పంపిణీ,*
,అన్ని మండలాల్లోని పాఠశాలలకు కార్యక్రమాన్ని విస్తరిస్తాం,
,జెవివి గౌరవాధ్యక్షులు గంగపట్నం బాలకృష్ణారెడ్డి,*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 20 కోట మండలం,*
నెల్లూరు జిల్లా కోట జన విజ్ఞాన వేదిక నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో కోట మండలంలోని వంజివాక, గోవిందపల్లి గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించారు. జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు గంగపట్నం బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. బాలకోటేశ్వరరావు, నెల్లూరు హాస్పిటల్ సహకారంతో విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు నిర్వహించి కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగపట్నం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండు పాఠశాలల్లో 250 మంది విద్యార్థినీ, విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అన్ని మండలాల్లోని పాఠశాలల్లో ఈ బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డాక్టర్ బాలకోటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదికను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం మంచి పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంజివాక హైస్కూల్ హెడ్మాస్టర్ కె. నాగయ్య, గోవిందపల్లి ఇన్చార్జి హెడ్మాస్టర్ రాజశేఖర్, జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు కె. వేణుగోపాల్, కోట మండల జెవివి అధ్యక్షులు పోలాని రాజేంద్ర, జిల్లా కమిటీ సభ్యులు ఎ. శంకర్, హాస్పిటల్ సిబ్బంది, టెక్నీషియన్లు లోకేశ్వరి, స్వరూప, అఖిల, స్రవంతి, సుచరిత, ఏఎన్ఎం గౌతమి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన జన విజ్ఞాన వేదిక కోట మండల శాఖకు జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలిపారు.



