వింజమూరులో షేక్ షరీఫ్ హల్దీ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్
వింజమూరు మే 21: పున్నమి ప్రతినిధి ధనుంజయ
వింజమూరు పట్టణంలోని వైశ్య బజార్లో శ్రీ షేక్ చిరువెళ్ళ బాబు – శ్రీమతి బీబి దంపతుల కుమారుడు షేక్ షరీఫ్ నిఖా వేడుకల సందర్భంగా నిర్వహించిన హల్దీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై వరుడు షేక్ షరీఫ్ను ఆప్యాయంగా ఆశీర్వదించారు. ఆయన వైవాహిక జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ముస్లిం సోదరులతో స్నేహపూర్వకంగా ముచ్చటించి వారి ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కంభం విజయరామిరెడ్డి, అభిమానులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


