తిరుపతి సిపిఐ. ఆగస్టు 06 పున్నమి ప్రతినిధి
మార్పుపై పాదయాత్ర లో ప్రజలలో చైతన్యవంతం చేసి ప్రభుత్వంపై పోరాటటానికి సిద్ధం చేయడం – సిపిఐ
సిపిఐ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా మార్పు కోసం ప్రజలలో చైతన్యం తీసుకురావడం కోసం నేటి నుండి 15వ తేదీ వరకు పల్లె నుండి ఢిల్లీ దాకా పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో గల రేణిగుంట మండల కేంద్రమైన రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి పాదయాత్ర ప్రారంభమైందని ఈ పాదయాత్రను పార్టీ జిల్లా కార్యదర్శి పి మురళి ప్రారంభించారు
ఆ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డు లో అక్కడ ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా చూడటం తెలుసుకోవడం ప్రజలకు వివరించి చైతన్యపరిచి సమస్యలకు కారణాలు వివరించి అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయడం కోసం జరుగుతున్న ఈ మార్పు కోసం పాదయాత్ర ప్రజల చైతన్యానికి ప్రజలలో మార్పు తీసుకువచ్చి ప్రభుత్వంపై పోరాడటానికి ప్రజలను సిద్ధం చేయడానికి జరుగుతున్న పాదయాత్ర లు సెప్టెంబర్ 1వ తారీఖున ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జిల్లా నుండి కదలి రావాలి అని ఆయన అన్నారు
రేణిగుంట లో ప్రారంభమైన పాదయాత్ర స్థానిక సమస్యలు పై ప్రజలతో మాట్లాడుతూ నాయకులు సమస్యలను ప్రత్యేకంగా చూడటం అధికారులతో మాట్లాడటం పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని చిన్న చిన్న సభలు సమావేశాలు జరుపుకుంటూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని ప్రాంతాలలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం పాదయాత్రలు జరుగుతాయి సమస్యలను తెలుసుకుంటారని పరిష్కారం కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని సమస్యలు పరిష్కారం అయ్యేదాకా భారత కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తుంది అని ఆయన అన్నారు
ఈ పాదయాత్రలు ప్రజల మార్పు కోసం ప్రజల చైతన్యాన్ని అభివృద్ధి పరచడం కోసం ఇచ్చిన హామీలు అమలు పరచడం కోసం ప్రభుత్వం మెడలు వంచి పోరాటాల ద్వారా సమస్యల పరిష్కారం కు కృషి చేయడం ప్రజలలో మార్పు తీసుకురావడం కోసం జరిగే పాదయాత్ర ఇవి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికలలో గెలవడం కోసం అనేక హామీలు ఇచ్చారని ఆ హామీలు అమలు కావడం లేదని కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దువుతున్నాయని ప్రజలు కు ఇచ్చిన ఏ హామీలు అమలుపరచడం లేదని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏమైంది అని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాలు చౌకగా ప్రైవేటు వారికి అప్పజెప్పడం జరుగుతుందని ఢిల్లీలో విద్యార్థి యువజన గర్జన కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన పోరాట స్ఫూర్తితో రానున్న కాలంలో పోరాటాలకు పదును పెడతామని సమస్యలు పరిష్కారమయ్యే దాకా పట్టు వదలని మిల్టెంట్ పోరాటాలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధమవుతోంది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రాధాకృష్ణ కాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి జనామాల గురవయ్య కత్తి రవి రేణిగుంట మండల కార్యదర్శి వై ఎస్ మణి కార్తీక్ చారులత మల్లికార్జున్ చంద్రకళ సుబ్బరాజు రజాక్ భాను సెల్వా రమణ మురళి అమ్ములు తరుణ్ శివగామి రసూల్ గురవయ్య జయరామయ్య తదితరులు పాల్గొన్నారు
నమస్కారములతో
వై ఎస్ మణి
కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ
రేణిగుంట మండల సమితి


