ఓబులవారిపల్లి మండలం మంగళంపల్లి గ్రామంలో గురువారం వైద్య సేవలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రికి దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలు చేపట్టినట్లు డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. శిబిరంలో బీపీ, షుగర్, విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. సుమారు 150 మంది గ్రామస్థులు వైద్య సేవలను వినియోగించుకున్నారు. ప్రజలు ఇలాంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు.

మంగళంపల్లిలో 150 మందికి వైద్య సేవలు
ఓబులవారిపల్లి మండలం మంగళంపల్లి గ్రామంలో గురువారం వైద్య సేవలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రికి దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలు చేపట్టినట్లు డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. శిబిరంలో బీపీ, షుగర్, విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. సుమారు 150 మంది గ్రామస్థులు వైద్య సేవలను వినియోగించుకున్నారు. ప్రజలు ఇలాంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు.

