బీజేపీలోకి రావాలని అడ్వకేట్ గొడుగుల మహేంద్రకు ఆహ్వానం
మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా బీజేపీ నాయకులు
విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబర్ 4: పున్నమి ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ, ఉపాధ్యక్షులు బి. అప్పారావు, నేషనల్ మెంబర్ మాన్యుదేవుడు, కిసాన్ మోర్చా అధ్యక్షులు రామకోటి తదితర బీజేపీ నాయకులు శుక్రవారం అడ్వకేట్ గొడుగుల మహేంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనను తన కార్యాలయంలో కలిసి, భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను నాయకులు వివరించినట్లు తెలిపారు.
గొడుగుల మహేంద్రతో పార్టీ నాయకులు కొంతసేపు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించారు. ఆయనను బీజేపీలోకి ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


