Saturday, 12 July 2025
  • Home  
  • ప్రతి ఇంటా ” కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్” మొబైల్ యాప్
- ఆంధ్రప్రదేశ్

ప్రతి ఇంటా ” కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్” మొబైల్ యాప్

శ్రీకాకుళం : ప్రతి ఇంటా ” కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్” మొబైల్ యాప్ ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 వ విడత ఇంటింటి ఫీవర్ సర్వేలో  భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్ యాప్ ను ఆశా కార్యకర్త, ఏ.ఎన్.ఎం ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తూ  స్వయంగా డౌన్ లోడ్ చేయాలని పేర్కొన్నారు. సర్వే సమయానికి ముందు రోజు ఫీవర్  సర్వే గురించి ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలు అందరూ అందుబాటులో ఉండే సమయాలలో సర్వే నిర్వహించాలని తద్వారా మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.  సర్వే కార్యక్రమాన్ని ఆయా ప్రాంత ఆశా కార్యకర్త,ఏ.ఎన్.ఎం స్వయంగా నిర్వహించాలని తెలిపారు. వాలంటీర్ సర్వేలో పాల్గొని తమ మొబైల్ ఆప్ ద్వారా ఆశా, ఏ.ఎన్.ఎం చెప్పిన వివరాలు నమోదు చేయాలని అన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని గమనించాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా మలేరియా,డెంగీ వంటి వ్యాధులను గూర్చి అవగాహన కలిగించి, నివారణ చర్యలు తీసుకొనే విధంగా చైతన్య పరచాలని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనే సిబ్బంది విధిగా మాస్కు ధరించి, తగిన ఇతర రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి సర్వే వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సర్వే వివరాలు నేరకుగా మోబైల్ యాప్ ద్వారా ప్రతి ఇంటి సర్వేలో భాగంగా ఆ ఇంటి వద్దనే అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. తాళాలు వేసిన ఇళ్ళు ఉంటే వదిలి పెట్టరాదని, ఇంటి మనుషులు వచ్చిన వెంటనే అప్ లోడ్ చేయాలని సూచించారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా సహనం, ఓర్పుతో సర్వే చేపట్టి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు.

శ్రీకాకుళం : ప్రతి ఇంటా ” కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్” మొబైల్ యాప్ ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 వ విడత ఇంటింటి ఫీవర్ సర్వేలో  భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్ యాప్ ను ఆశా కార్యకర్త, ఏ.ఎన్.ఎం ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తూ  స్వయంగా డౌన్ లోడ్ చేయాలని పేర్కొన్నారు. సర్వే సమయానికి ముందు రోజు ఫీవర్  సర్వే గురించి ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలు అందరూ అందుబాటులో ఉండే సమయాలలో సర్వే నిర్వహించాలని తద్వారా మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.  సర్వే కార్యక్రమాన్ని ఆయా ప్రాంత ఆశా కార్యకర్త,ఏ.ఎన్.ఎం స్వయంగా నిర్వహించాలని తెలిపారు. వాలంటీర్ సర్వేలో పాల్గొని తమ మొబైల్ ఆప్ ద్వారా ఆశా, ఏ.ఎన్.ఎం చెప్పిన వివరాలు నమోదు చేయాలని అన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని గమనించాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా మలేరియా,డెంగీ వంటి వ్యాధులను గూర్చి అవగాహన కలిగించి, నివారణ చర్యలు తీసుకొనే విధంగా చైతన్య పరచాలని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనే సిబ్బంది విధిగా మాస్కు ధరించి, తగిన ఇతర రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి సర్వే వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సర్వే వివరాలు నేరకుగా మోబైల్ యాప్ ద్వారా ప్రతి ఇంటి సర్వేలో భాగంగా ఆ ఇంటి వద్దనే అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. తాళాలు వేసిన ఇళ్ళు ఉంటే వదిలి పెట్టరాదని, ఇంటి మనుషులు వచ్చిన వెంటనే అప్ లోడ్ చేయాలని సూచించారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా సహనం, ఓర్పుతో సర్వే చేపట్టి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.