రాపూరు, మే 13, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణంలోని విద్యావనరుల కేంద్రం ప్రాంగణంలో కరోన కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యమే తమ సంతోషం గా భావించి పారిశుధ్యపనులు పనులు చేస్తున్న కార్మికుల సేవలను వారి సాధక బాధకాలను గుర్తించిన యం.ఆర్.పి.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక యం.ఆర్.పి.యస్ నాయకులు మరియు MEF నాయకులు యం.పి.డి.ఓ ఆమోస్ బాబు చేతులు మీదుగా నిత్యవసర సరుకులను,వివిధ రకాల పౌష్టికాహారంను వారికి అందించారు.ఈ సందర్భంగా MEF రాపూరు మండల అధ్యక్షులు కార్తీక్ మాట్లాడుతూ పారిశుధ్యకార్మికుల సేవలు ఈ సమయంలో వెల కట్టలేనివని వారికి ఏమిచ్చినా తక్కువే అని వారి సాధక బాధకాలను గుర్తించిన యం.ఆర్.పి.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆదేశానుసారం ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం.ఇ.ఓ శ్రీనివాసులు,ఎ.పి.యం కృష్ణయ్య,ఇ,ఓ,పి.ఆర్డి,గంగయ్య,సచివాలయ సిబ్బంది,యం.ఆర్ .పి యస్.నాయకులు రంగయ్య,పెంచలనరసయ్య,అంకయ్య, MEF నాయకులు డి.పెంచలయ్య,డాక్టర్ శేషు,గంపాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు నిత్యవసర సరుకులను,పౌష్టికాహారం పంపిణీ
రాపూరు, మే 13, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణంలోని విద్యావనరుల కేంద్రం ప్రాంగణంలో కరోన కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యమే తమ సంతోషం గా భావించి పారిశుధ్యపనులు పనులు చేస్తున్న కార్మికుల సేవలను వారి సాధక బాధకాలను గుర్తించిన యం.ఆర్.పి.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక యం.ఆర్.పి.యస్ నాయకులు మరియు MEF నాయకులు యం.పి.డి.ఓ ఆమోస్ బాబు చేతులు మీదుగా నిత్యవసర సరుకులను,వివిధ రకాల పౌష్టికాహారంను వారికి అందించారు.ఈ సందర్భంగా MEF రాపూరు మండల అధ్యక్షులు కార్తీక్ మాట్లాడుతూ పారిశుధ్యకార్మికుల సేవలు ఈ సమయంలో వెల కట్టలేనివని వారికి ఏమిచ్చినా తక్కువే అని వారి సాధక బాధకాలను గుర్తించిన యం.ఆర్.పి.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆదేశానుసారం ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం.ఇ.ఓ శ్రీనివాసులు,ఎ.పి.యం కృష్ణయ్య,ఇ,ఓ,పి.ఆర్డి,గంగయ్య,సచివాలయ సిబ్బంది,యం.ఆర్ .పి యస్.నాయకులు రంగయ్య,పెంచలనరసయ్య,అంకయ్య, MEF నాయకులు డి.పెంచలయ్య,డాక్టర్ శేషు,గంపాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.