దుత్తలూరులో పోలీసుల విస్తృత కార్డన్ & సెర్చ్ – 17 బైకులు స్వాధీనం
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు దుత్తలూరు మండలంలోని కరెంట్ ఆఫీస్ కాలనీ, fb దండలపల్లి కాలనీలలో పోలీసులు విస్తృత కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ మోసాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని అధికారులు ప్రజలను కోరారు.


