అనంతసాగరం ఆగస్టు 31, పున్నమి ప్రతినిధి:
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవరం గ్రామ ఎస్సీ కాలనీలో సోమవారం పౌరహక్కుల దినోత్సవం గ్రామసభను స్థానిక మండల తహసిల్దార్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతసాగరం తహసీల్దార్ వీరవసంతరావు, మండల ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్ హాజరయ్యారు. వారితో కలిసి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షులు నీరుకట్టు శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కాలనీవాసులకు వివరించారు. ఎవరైనా అన్యాయానికి గురైతే భయపడకుండా చట్టపరమైన సహాయం తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షులు నీరుకట్టు శ్రీహరి పాల్గొని కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామ పెద్దలు, కాలనీవాసులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


