పీ జి ఆర్ ఎస్ లో సమస్యలపై 10 వినతులు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై సమీక్షా సమావేశం.
పున్నమి ప్రతినిధి ,రామచంద్రపురం
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ) కార్యక్రమాన్ని బూత్ లెవెల్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా చేపట్టాలని తహశీల్దార్ యు మధుసూదన్ రావు అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీలకు బి ఎల్ ఏ లు, తహశీల్దార్ కార్యాలయంలో బిఎల్ఓ లతో సమిక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఎల్ వో లు 2022 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసి ఇంటింటి సర్వే నిర్వహించి మరణించిన, నకిలీ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించాలన్నారు. స్పెషల్ ఇంటెన్షవ్ రివిజన్(SIR… 2026) నిర్వహణలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలకు చెందిన బి ఎల్ ఎ లు కూడా ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలన్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన కొత్తవారికి ఓటు హక్కు కల్పించడంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పది సమస్యలపై ప్రజలు ఎన్నికలు సమర్పించారని ఆయన తెలిపారు. పి జి ఆర్ ఎస్ లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పులిరాం సింగ్, ఎంఈఓ లు వి మార్కండేయ నాయుడు, జయ వేలు, డిప్యూటీ ఎంపీడీవో తేజోవతి, డిప్యూటీ తహశీల్దార్లుఎం అన్వర్ భాష, అమృత, వీఆర్వో శ్రీనివాసులు, ప్రదీప్ నాయుడు, రాజశేఖర్, నరసింహులు, మల్లికార్జున్ రెడ్డి, ఝాన్సీ రాణి, వెంకటరమణ, వంశీకృష్ణ, బిఎల్వోలు, బి ఎల్ ఏ లు పాల్గొన్నారు.



