సంగారెడ్డి, మే 19:కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం మండలం, ఒస్మాన్నగర్ గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.60 లక్షల అంచనా వ్యయంతో ఈ పనులు చేపడుతున్నారు.సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి గారికి స్థానిక నాయకుల ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
భవిష్యత్ తరాల మెరుగైన భవిత కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని మంత్రి అన్నారు.


