కరప, ఆగస్టు 26: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు కరప మండలం పెనుగుదురు గ్రామంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజాభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




