SPSR నెల్లూరు జిల్లా, 08.05.2026: ఆటోనగర్ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న లారీ బ్యాటరీ దొంగతనాల కేసును వేదాయపాలెం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1.45 లక్షల విలువైన 14 లారీ బ్యాటరీలు మరియు ఒక Hyundai i20 కారును స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వేళల్లో లారీలను లక్ష్యంగా చేసుకుని బ్యాటరీలు దొంగిలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన వేదాయపాలెం పోలీసుల పనితీరును జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS అభినందించి, పాల్గొన్న సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.


