Saturday, 29 August 2026
  • Home  
  • అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి చొరవతో పశ్చిమ బెంగాల్ నుంచి ఏడుగురు మత్స్యకారుల సురక్షిత స్వస్థల ప్రయాణం ప్రారంభం డ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి చొరవతో పశ్చిమ బెంగాల్ నుంచి ఏడుగురు మత్స్యకారుల సురక్షిత స్వస్థల ప్రయాణం ప్రారంభం డ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారుల సురక్షిత రాక కోసం అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి.ఎం. హరీష్ బాలయోగి వ్యక్తిగతంగా చొరవ తీసుకుని, మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రమంత్రితో సైతం ఆయన ఈ విషయంలో మాట్లాడారు.మత్స్యకారుల ఆచూకీ లభించిన వెంటనే, పశ్చిమ బెంగాల్ మెరైన్ డీఐజీతో పాటు అక్కడి ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ, మత్స్యకారులను సురక్షితంగా పశ్చిమ బెంగాల్ నుంచి స్వస్థలమైన అమలాపురానికి తరలించే ఏర్పాట్లు చేశారు.ప్రస్తుతం ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ నుంచి అమలాపురం వైపు బయలుదేరారు. వారి ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నేరుగా స్వగ్రామాలకు చేరుకునేందుకు అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి ప్రత్యేకంగా టెంపో ట్రావెలర్ వాహనాన్ని ఏర్పాటు చేశారు.మత్స్యకారులు తమ కుటుంబ సభ్యుల వద్దకు క్షేమంగా చేరుకునే వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎంపీ హరీష్ బాలయోగి స్వయంగా పర్యవేక్షిస్తూ, ప్రతి దశలో సంబంధిత అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా మత్స్యకారుల సురక్షిత రాక కోసం సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పశ్చిమ బెంగాల్ అధికారులు మరియు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎంపీ శ్రీ జి.ఎం. హరీష్ బాలయోగి కృతజ్ఞతలు తెలిపారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారుల సురక్షిత రాక కోసం అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి.ఎం. హరీష్ బాలయోగి వ్యక్తిగతంగా చొరవ తీసుకుని, మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రమంత్రితో సైతం ఆయన ఈ విషయంలో మాట్లాడారు.మత్స్యకారుల ఆచూకీ లభించిన వెంటనే, పశ్చిమ బెంగాల్ మెరైన్ డీఐజీతో పాటు అక్కడి ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ, మత్స్యకారులను సురక్షితంగా పశ్చిమ బెంగాల్ నుంచి స్వస్థలమైన అమలాపురానికి తరలించే ఏర్పాట్లు చేశారు.ప్రస్తుతం ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ నుంచి అమలాపురం వైపు బయలుదేరారు. వారి ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నేరుగా స్వగ్రామాలకు చేరుకునేందుకు అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి ప్రత్యేకంగా టెంపో ట్రావెలర్ వాహనాన్ని ఏర్పాటు చేశారు.మత్స్యకారులు తమ కుటుంబ సభ్యుల వద్దకు క్షేమంగా చేరుకునే వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎంపీ హరీష్ బాలయోగి స్వయంగా పర్యవేక్షిస్తూ, ప్రతి దశలో సంబంధిత అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా మత్స్యకారుల సురక్షిత రాక కోసం సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పశ్చిమ బెంగాల్ అధికారులు మరియు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎంపీ శ్రీ జి.ఎం. హరీష్ బాలయోగి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.