ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 23 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రైతు సుబ్రహ్మణ్యంకు చెందిన 10 ఎకరాల విస్తీర్ణంలోని గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 600 గడ్డి మోపులు కాలిపోగా, దాదాపు రూ.60 వేల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

అక్కంపేటలో అగ్నిప్రమాదం.. 10 ఎకరాల గడ్డివాము దగ్ధం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 23 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రైతు సుబ్రహ్మణ్యంకు చెందిన 10 ఎకరాల విస్తీర్ణంలోని గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 600 గడ్డి మోపులు కాలిపోగా, దాదాపు రూ.60 వేల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

