ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జులై 1 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు, జూలై 1: పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మనుబోలు మండలంలోని గ్రామాల్లో స్వచ్ఛపథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జలజాక్షి తెలిపారు. బుధవారం మనుబోలులో కార్యక్రమాన్ని పరిశీలించిన ఆమె రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాలను స్వయంగా పర్యవేక్షించి శుభ్రం చేయించారు. గ్రామ ప్రజలు పరిశుభ్రతను అలవాటు చేసుకుని ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులు, కార్యదర్శి శ్రీహరి, టీడీపీ నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు, రాజాగౌడ్, మోపూరు ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛపథం కార్యక్రమాన్ని పరిశీలించిన ఎంపీడీవో జలజాక్షి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జులై 1 (పున్నమి ప్రతినిధి) మనుబోలు, జూలై 1: పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మనుబోలు మండలంలోని గ్రామాల్లో స్వచ్ఛపథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జలజాక్షి తెలిపారు. బుధవారం మనుబోలులో కార్యక్రమాన్ని పరిశీలించిన ఆమె రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాలను స్వయంగా పర్యవేక్షించి శుభ్రం చేయించారు. గ్రామ ప్రజలు పరిశుభ్రతను అలవాటు చేసుకుని ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులు, కార్యదర్శి శ్రీహరి, టీడీపీ నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు, రాజాగౌడ్, మోపూరు ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

