ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 28 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి సత్తా చాటుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రామిరెడ్డి పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటుతుంది: వాసిరెడ్డి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 28 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి సత్తా చాటుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రామిరెడ్డి పేర్కొన్నారు.

