ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 21 (పున్నమి ప్రతినిధ
మనుబోలు, జూలై 21: మనుబోలులో వరిసాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిచినో కంపెనీ చైర్మన్ తనకా తోషిటమో శాన్ రైతులతో సమావేశమయ్యారు. వరిసాగు పరిస్థితులు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు వేరుకుళ్లు, గడ్డి మందు, మొవ్వుపిప్పి వంటి సమస్యలను వివరించి, సమర్థవంతమైన మందులు అందించాలని కోరారు. దీనిపై స్పందించిన చైర్మన్, ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త ఉత్పత్తులను వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రవి ఫర్టిలైజర్స్ ప్రతినిధులు దామిశెట్టి రంగారావు పాల్గొన్నారు.

వరిసాగు సమస్యలపై రైతులతో నిచినో కంపెనీ చైర్మన్ సమావేశం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 21 (పున్నమి ప్రతినిధ మనుబోలు, జూలై 21: మనుబోలులో వరిసాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిచినో కంపెనీ చైర్మన్ తనకా తోషిటమో శాన్ రైతులతో సమావేశమయ్యారు. వరిసాగు పరిస్థితులు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు వేరుకుళ్లు, గడ్డి మందు, మొవ్వుపిప్పి వంటి సమస్యలను వివరించి, సమర్థవంతమైన మందులు అందించాలని కోరారు. దీనిపై స్పందించిన చైర్మన్, ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త ఉత్పత్తులను వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రవి ఫర్టిలైజర్స్ ప్రతినిధులు దామిశెట్టి రంగారావు పాల్గొన్నారు.

