నర్సంపేట కేంద్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీను వెంటనే అమలు చేయాలని బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్ డిమాండ్ చేశారు. నవ తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నర్సంపేట మల్లంపల్లి రోడ్లు వద్ద నిరసన చేపట్టారు. ప్రతి డ్రైవర్ కు ఏటా రూ. 12వేల జీవన భృతి, ప్రత్యేక సంక్షేమ కార్పొరేషన్, ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ఆటో ఇంధనం ధరలు వాటికి సంబంధించిన విడివిడి భాగాలు ఆటో యొక్క ఫైనాన్స్ భారాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనె యువరాజ్ మరియు ఇతర డ్రైవర్లు పాల్గొనడం జరిగింది.



