ఐటీడీఏ పాడేరు ఆధ్వర్యంలో 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు గల యువతకు కృత్రిమ మేధస్సు నైపుణ్యాలు పై శిక్షణ అందించనున్నట్లు పినకోట పంచాయతీ అభివృద్ధి అధికారి సతీష్ తెలిపారు.పినకోట పంచాయతీ పరిధిలోని 24 గ్రామాలకు చెందిన అర్హులైన యువత ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు 18-09-2026 చివరి తేదీగా తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 20-09-2026న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంపిక చేసి తదుపరి AI Skills శిక్షణ అందిస్తామని పంచాయతీ అభివృద్ధి అధికారి సతీష్ వెల్లడించారు.
అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


