ఆగస్టు 26, 2026
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా నిర్వహించే పవిత్రోత్సవాలు మంగళవారం పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. చివరి రోజున యాగశాలలో హోమాలు, శ్రీమలయప్పస్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపట్టగా, రాత్రి వేళ అర్చకులు పవిత్ర పూర్ణాహుతిని నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో ఈ పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి.

పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన తిరుమల పవిత్రోత్సవాలు
ఆగస్టు 26, 2026 తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా నిర్వహించే పవిత్రోత్సవాలు మంగళవారం పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. చివరి రోజున యాగశాలలో హోమాలు, శ్రీమలయప్పస్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపట్టగా, రాత్రి వేళ అర్చకులు పవిత్ర పూర్ణాహుతిని నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో ఈ పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి.

