తెలంగాణ రాజ్యాధికారం పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న
మహా పాదయాత్ర ను విజవంతం చేయాలి : టి ఆర్ పి రాష్ట్ర, జిల్లా నాయకులు
——————————————————————-
జనగామ, సెప్టెంబర్ 16,పున్నమి జిల్లా ప్రతినిధి :
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేపు ఉదయం ఏడు గంటలకు గోల్కొండ కోట నుండి ప్రారంభించే మహా పాదయాత్రను విజయవంతం చేయాలని జనగామ జిల్లా టిఆర్పి పార్టీ కుటుంబ సభ్యులను పార్టీ కార్యకర్తలను రాష్ట్ర నాయకులు విద్యార్థి విభాగాలు నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా విభాగం నాయకురాలు హాజరై కార్యక్రమాలు విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశించిన జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ కోరారు.జనగామ నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కర్నల్ మాచర్ల బిక్షపతి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మౌనిక యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ని స్థాపించిన రోజు 17 సెప్టెంబర్ ఒక చారిత్రకమైన చరిత లో నిలిచిపోతుంది. ఇదే రోజున పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న మహాపాద యాత్ర చేపట్టిన దినం కూడా చరిత్ర లో లిఖించ బడుతుందని తెలిపారు.విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పిట్టల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రం లో విద్యార్థులతో జెన్ జీ ముఖాముఖీ సమావేశాలు ఏర్పాటు,పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ను కాపాడడానికి,బడుగు బలహీన వర్గాల విద్యార్థుల స్కాలషిప్ తక్షణమే విడుదల కొరకు శాసన మండలి లో ప్రశ్నించడం, ప్రభుత్వంను
నిలదీసిన మహా నాయకులు మన తీన్మార్ మల్లన్న,ఈ మహా పాద యాత్రలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి గడ్డం కృష్ణ,జిల్లా ఉపాధ్యక్షులు రేణుకుంట్ల మురళి బైండ్ల,జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇల్లందుల రవి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లందుల సమ్మయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వెంపటి అజయ్,జిల్లా యూత్ ఉపాధ్యక్షులు గంగరాజు,జిల్లా కార్యదర్శి మంద దిలిప్ తదితరులు పాల్గొన్నారు.


