నవజాత శిశువులకు పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించడాన్ని ప్రోత్సహించడం.
మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలే ఇవ్వాలని అవగాహన కల్పించడం.
తల్లి, శిశువు ఆరోగ్యానికి తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం.
తల్లిపాలను అందించే తల్లులకు కుటుంబం, సమాజం మరియు కార్యాలయాల్లో మద్దతు పెంచడం.
శిశువుకు అవసరమైన సంపూర్ణ పోషకాహారం అందుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
తల్లికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మరియు తల్లి-బిడ్డ బంధం మరింత బలపడుతుం ది
“తల్లిపాలే బిడ్డకు తొలి టీకా – తొలి ఆహారం, తొలి రక్షణ.” అని మంగళూరుపేట సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు తెలపడం జరిగింది .



