జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా నెల్లూరు పోలీసులు ప్రత్యేక నాకాబంది, లాడ్జీల తనిఖీలు నిర్వహించారు. 238 మంది పోలీసు సిబ్బందితో విస్తృత తనిఖీలు చేపట్టి మొత్తం 521 కేసులు నమోదు చేసి రూ.1.56 లక్షల జరిమానాలు విధించారు. రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ క్రైమ్ ప్రోన్ ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని వెంటనే డయల్-112 లేదా జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 9392903143కు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాగుతుందని అధికారులు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నాకాబంది, లాడ్జీల తనిఖీలు నిర్వహించిన నెల్లూరు పోలీసులు
జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా నెల్లూరు పోలీసులు ప్రత్యేక నాకాబంది, లాడ్జీల తనిఖీలు నిర్వహించారు. 238 మంది పోలీసు సిబ్బందితో విస్తృత తనిఖీలు చేపట్టి మొత్తం 521 కేసులు నమోదు చేసి రూ.1.56 లక్షల జరిమానాలు విధించారు. రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ క్రైమ్ ప్రోన్ ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని వెంటనే డయల్-112 లేదా జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 9392903143కు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాగుతుందని అధికారులు తెలిపారు.

