బీజేపీ ఖమ్మం జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీని జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి శుక్రవారం ప్రకటించారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా మహిళా నాయకులు, కార్యకర్తలకు కమిటీలో ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులకు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.



