Wednesday, 19 August 2026
  • Home  
  • ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలి : అరకు ఎమ్మెల్యే
- అల్లూరి సీతారామరాజు

ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలి : అరకు ఎమ్మెల్యే

పాడేరు ఐటీడీఏలో 16 నెలలుగా పాలకవర్గ సమావేశం జరగకపోవడం గిరిజనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఈ మేరకు బుధవారం అరకులోయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, డోలిమోతలు వంటి సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మూడు నెలలకు ఒకసారి సమావేశం జరగాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం, కలెక్టర్, ఐటీడీఏ పీవో వెంటనే సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం సమీక్షలు నిరంతరం జరగాలని, ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

పాడేరు ఐటీడీఏలో 16 నెలలుగా పాలకవర్గ సమావేశం జరగకపోవడం గిరిజనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఈ మేరకు బుధవారం అరకులోయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, డోలిమోతలు వంటి సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మూడు నెలలకు ఒకసారి సమావేశం జరగాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం, కలెక్టర్, ఐటీడీఏ పీవో వెంటనే సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం సమీక్షలు నిరంతరం జరగాలని, ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.