అనకాపల్లి జిల్లా, జూలై 5 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలంలోని ఏటికొప్పాక గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో చిన్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, గ్రామ ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమం నిర్వహణకు సహకరించిన గ్రామ ప్రజలకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.



