అబ్దుల్లాపూర్మెట్లో రూ.4.25 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
అబ్దుల్లాపూర్మెట్, ఆగస్టు 13: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పలు గ్రామాల్లో రూ.4.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని నాయకులు తెలిపారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.



