జిల్లాలో రెడ్క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయాలి: కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల జిల్లాలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసి, ప్రజలకు మెరుగైన మానవతా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా తెలిపారు. శనివారం మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రెడ్క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్తో కలిసి ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సొంత భవనం, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, జనౌషధి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే డోన్, శ్రీశైలం, జాతీయ రహదారుల పరిసరాల్లో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ.. నిరాశ్రయుల కోసం ఆశ్రయ కేంద్రాలు, విధుల్లో ఉండే પોલીસ సిబ్బందికి ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు.అనంతరం సేవా కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన వారికి కలెక్టర్, ఎస్పీల చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ అరుణ కుమారి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


