వర్షాకాలంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి : వై.ఓ. నందన్
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో పారిశుధ్య పనులను మరింత సమర్థంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశించారు. బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో శానిటేషన్ విభాగంతో నిర్వహించిన సమీక్షలో డ్రైన్ల పూడికతీత, చెత్త తొలగింపు, నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రతిరోజూ స్ప్రేయింగ్, ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. GVPలు, బ్లాక్స్పాట్లను గుర్తించి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని తెలిపారు. సిబ్బంది యూనిఫామ్తో విధులకు హాజరై, వార్డు వర్కర్ల హాజరును నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, డాక్టర్ జిజియా, డాక్టర్ మదన్మోహన్, శానిటరీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


