Sunday, 23 August 2026

Tag: collectorate

జయశంకర్ భూపాలపల్లి

భూ భారతి పనులకు వేగం పెంచాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

భూ భారతి, సాదా బైనామా, బల్క్ ల్యాండ్ సర్వే వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బల్క్ భూముల సర్వే, భూ భారతి, సాదా బైనామా, సర్ ప్రక్రియకు నోటీసులు జారీ తదితర అంశాలపై తహసీల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. సాదా బైనామాలో 2325, భూ భారతి 93 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ ఓటర్లు, అనామలిస్ ఓటరులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. జారీ చేసిన నోటీసు, నోటీసు తీసుకున్న వ్యక్తి ఫోటోలు ఎన్నికల సంగం పోర్టల్ అప్ లోడ్ చేయాలని సూచించారు. బల్క్ ల్యాండ్ సర్వే పూర్తి అయిన సర్వే నంబర్లుపై సమగ్ర నివేదికలు అందచేయాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ వసంత రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి

పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, ఆగస్టు 20(పున్నమి ప్రతినిధి): పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ, నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పుస్తకాలు, పాఠకులకు అందుతున్న సౌకర్యాలు, డిజిటల్ లైబ్రరీ ఏర్పాట్లు, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు.అభ్యర్థులకు అవసరమైన కాంపిటీటివ్ పుస్తకాలు, కంప్యూటర్ సదుపాయం, ఆర్‌ఓ వాటర్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.గ్రంథాలయాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రమశిక్షణతో చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని అభ్యర్థులకు సూచించారు. అనంతరం గ్రంథాలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, గ్రంథాలయ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.