ఖమ్మం ఆగష్టు 12
(పున్నమి ప్రతినిధి)
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల్లో ఎలాంటి అపోహలు లేకుండా వాస్తవ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. కోరారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు, డబుల్ నమోదైన ఓటర్ల వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. SIR ప్రక్రియను పారదర్శకంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.


