PPP పనితీరులో పెద్దాపురానికి అగ్రస్థానం.. కాకినాడ జిల్లాలో ఫస్ట్, రాష్ట్రంలో 7వ స్థానం
కాకినాడ జిల్లా: రాష్ట్ర నివేదిక ప్రకారం PPP పనితీరులో పెద్దాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో ప్రథమ స్థానంలో, రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో నిలిచిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ తెలిపారు.
నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని రంగనాగ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.
పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు రంగనాగ్ కృతజ్ఞతలు తెలిపారు.



