Thursday, 9 July 2026

Blog

Featured

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి*

  దూర ప్రాంతాలకు జిల్లా మీదుగా సైకిల్ మీద అలాగే కాలినడకన వెళుతున్న  వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి శిబిరాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. తదనంతరం రిజిస్ట్రార్ గారు వలస  కూలీలలకు పండ్లు , మజ్జిగ, బిస్కట్ మరియు చల్లని నీళ్ల బాటిల్స్ ను పంపిణి చేశారు. రిజిస్ట్రార్ డా. విజయ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి ఆదేశానుసారంగా మరియు జిల్లా అధికారుల అనుమతితో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ శిబిరం ద్వారా కోవిద్ -19 వ్యాధి వలన సంభవించిన విపత్కర పరిస్థితులలో  లక్షల మంది వలస కూలీలు  వందలు వేల కిలోమీటర్ల దూరం  లో వున్నా ఒడిస్సా , కలకత్తా  రాష్ట్రాలకు  వెళుతున్న వలస కూలీలకు విశ్వవిద్యాలయము తరపున కొంత చేయూత నివ్వటానికి ముందుకు వండని అన్నారు. వలస కూలీల కోసం  ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న కార్యక్రమాలకు, తమంతు సాయంగా ఉడతా భక్తి తో తాము చేస్తున్నామన్నారు. ఈ శిభిరం ఏర్పాటు చేయటానికి నిరంతరం శ్రమిస్తున్న హెల్ప్ ది నీడి  టీం ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యమంలో  కొప్పవరపు హరినాథ్ గారు సురేష్ హెరర్స్ యాజమాన్యం,  NSS  సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, డా, మధుమతి, డా చెంచు రెడ్డి, పీఆర్వో డా కోట మణికంఠ , హెల్ప్ ది నిడి టీం సభ్యులు పార్ధసారధి, రాజేష్, అఖిల్ , చైతన్య , జూనియర్ అఖిల్ మరియు డ్రైవర్ సాగర్ పాల్గొన్నారు.

Featured

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి*

దూర ప్రాంతాలకు జిల్లా మీదుగా సైకిల్ మీద అలాగే కాలినడకన వెళుతున్న  వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి శిబిరాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. తదనంతరం రిజిస్ట్రార్ గారు వలస  కూలీలలకు పండ్లు , మజ్జిగ, బిస్కట్ మరియు చల్లని నీళ్ల బాటిల్స్ ను పంపిణి చేశారు. రిజిస్ట్రార్ డా. విజయ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి ఆదేశానుసారంగా మరియు జిల్లా అధికారుల అనుమతితో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ శిబిరం ద్వారా కోవిద్ -19 వ్యాధి వలన సంభవించిన విపత్కర పరిస్థితులలో  లక్షల మంది వలస కూలీలు  వందలు వేల కిలోమీటర్ల దూరం  లో వున్నా ఒడిస్సా , కలకత్తా  రాష్ట్రాలకు  వెళుతున్న వలస కూలీలకు విశ్వవిద్యాలయము తరపున కొంత చేయూత నివ్వటానికి ముందుకు వండని అన్నారు. వలస కూలీల కోసం  ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న కార్యక్రమాలకు, తమంతు సాయంగా ఉడతా భక్తి తో తాము చేస్తున్నామన్నారు. ఈ శిభిరం ఏర్పాటు చేయటానికి నిరంతరం శ్రమిస్తున్న హెల్ప్ ది నీడి  టీం ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యమంలో  కొప్పవరపు హరినాథ్ గారు సురేష్ హెరర్స్ యాజమాన్యం,  NSS  సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, డా, మధుమతి, డా చెంచు రెడ్డి, పీఆర్వో డా కోట మణికంఠ , హెల్ప్ ది నిడి టీం సభ్యులు పార్ధసారధి, రాజేష్, అఖిల్ , చైతన్య , జూనియర్ అఖిల్ మరియు డ్రైవర్ సాగర్ పాల్గొన్నారు.

Featured

మనుబోలు జాతీయ రహదారి వెంబడి పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో విజిటబుల్ బిరియాని పంపిణీ

మనుబోలు 17-05-2020(పున్నమి ప్రతినిధి కె- వెంకటేష్) కరోనా లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులలో బిచ్చగాళ్లు ,లారీ డ్రైవర్లు,వలస కార్మికులు పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో మనుబోలు జడ్.పి.హెచ్.ఎస్ పదవ తరగతి పూర్వపు విద్యార్థులు (1998-1999 )అందరూ కలిసి దాదాపు 400 మందికి వెజిటబుల్ బిర్యాని ,గుడ్డు, బిస్కెట్ ప్యాకెట్ ,అరటిపండు మనుబోలు జాతీయ రహదారి వెంబడిమరియు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు మరియు వెంకటాచలం టోల్ ప్లాజా వరకూ ఆటోలో తిరుగుతూ రోడ్డు వెంబడి అందజేసినారు. పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ తమ వంతు సాయంగా అందజేయడం సంతృప్తినిచ్చింది అని తెలియజేసినారు భవిష్యత్తులో అందరం కలిసి మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయం అందజేసిన ప్రతి ఒక్క పూర్వపు విద్యార్థులకుఅభినందనలు తెలియజేశారు .

Featured ఆంధ్రప్రదేశ్

దివ్యంగులను ఆదుకోవాలి

ఈ రోజు జలవనరులశాఖ మాత్యులు గౌ DR .P . అనిల్ కుమార్ యాదవ్ గారిని అయన క్యాంపు కార్యాలయంలో కలిసి “కోవిద్-19 “లాక్ డౌన్ కష్టకాల సమయంలో ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యంగుల కుటుంబాలను ఆదుకోవాలని వివరించారు.

Featured

మనుబోలు తెలుగుదేశంపార్టీ అద్వర్యంలో40 వ రోజు విజిటబుల్ బిర్యానీ పంపిణీ

మనుబోలు 16-05-2020( పున్నమి ప్రతినిధి కె. వెంకటేష్) లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న బిక్షగాళ్లు వాహనదారులకు వలస కార్మికులు కు మనుబోలు టీడీపీఆద్వర్యంలో 40వరోజ విజిటబుల్ బిరియాని400మందికి పంపినిచేసినారు.ముఖ్యంగా వలసకార్మికులు ఆహారం లేక రోడ్డు వెంట నడుచుకుంటూ వెల్లడం చాలా బాధాకరం అని తెలిపారు. వీరిపట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆదుకోవాలని కొరినారు. ఈకార్యక్రమములో మనుబోలు టీడీపీనాయకులు పచ్చిపాల రామిరెడ్డి, కలికి రమేష్ రెడ్డి,చేరెడ్డి పద్మనాభిరెడ్డి, శివుడు రాజగౌడ్, చల్లగిరిప్రసాద్ ,సాని వెంకట రమణయ్య, రమణారెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ మరో కీలక ప్రకటన.. ఇక ప్రతీ గ్రామంలో జనతా బజార్..

  నెల్లూరు ,15.05.2020 పున్నమి✍ ప్రతి గ్రామ లో వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేస్తాం: సీఎం జగన్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రైతులు ప్రతిపంటను జనతా బజార్ల ద్వారా అమ్ముకోవచ్చని వెల్లడి జనతా బజార్లు రైతులకు ఉపయుక్తంగా ఉంటాయని వివరణ ఏపీ సీఎం జగన్ రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, 2021 చివరికల్లా ప్రతి గ్రామ సచివాలయం పక్కన వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.రైతులు పండించే ప్రతి పంటను అమ్ముకునేందుకు వైఎస్సార్ జనతా బజార్లు ఉపయుక్తంగా ఉంటాయని వివరించారు.వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు రైతులు కష్టపడకుండా వైఎస్సార్ జనతా బజార్లు సరైన వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. అంతేకాకుండా, గ్రామ స్థాయిలోనే కోల్డ్ స్టోరేజి సదుపాయం కల్పించే స్థాయికి అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మున్ముందు రాష్ట్ర, జిల్లా స్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేయనున్నామని, ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

Featured

వాట్ ఎన్ ఐడియా సర్ జీ..!!

నెల్లూరు ,15.05.2020 పున్నమి ✍ పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త సాంప్రదాయాలను పుట్టించాలంటే మన తెలుగు వారి తర్వాతే ఎవరైనా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో “పెళ్లి” శుభ లేఖ ను ఇలా అందరికీ ఉపయోగ పడేలా మాస్కులపై ముద్రించడం అంటే ఎంత గొప్ప ఆలోచనో కదా..

ఆంధ్రప్రదేశ్

రైతులకు ఎంత చేసినా తక్కువే

నెల్లూరు ,15.05.2020 పున్నమి ✍ రెండో విడత రైతు భరోసాను ప్రారంభించిన ఏపీ సీఎం రైతులకు ఎలా మేలు చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు ఎంత చేసినా తక్కువే అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.   రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రెండో విడత రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, రైతులు, ప్రజాప్రతినిధులతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు సీఎం మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.15,500 ఇస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇప్పుడు రూ.5,500 రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. సాధారణ పరిస్థితి ఉంటే ఒక పెద్ద సభ లాగా ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్లమన్నారు. కరోనా పరిస్థితి వల్ల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతు భరోసాను ప్రారంభిస్తున్నామన్నారు. వ్యవసాయానికి పెట్టబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.12,500 చొపమ్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పామన్నారు. ఆ సాయాన్ని పెంచి రూ.15,500 పెట్టుబడి సాయం చేస్తున్నామన్నారు.   రైతు కళ్లలో ఆనందం చూడాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ ఏడాది కూడా మంచి వర్షాలు పడాలని ఆకాంక్షించారు.  సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే.. గతేడాది రూ.6,534 కోట్లు రైతు భరోసా కింద చెల్లించాం. ఇప్పుడు 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది ఏప్రిల్‌లో రూ.2000, ఇప్పుడు రూ.5,500, అక్టోబర్‌లో రూ.4000, సంక్రాంతికి రూ.2000 కలిపి ప్రతి ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం కౌలు రైతులు, అటవీ అసైన్డ్‌ భూములు సాగు చేస్తున్న వారికి పీఎం కిసాన్‌ నిధి నుంచి రూ.2000 జమ కాలేదని, ఆ డబ్బు కలిపి ఇప్పుడు కౌలు రైతులకు రూ.7,500 జమ చేస్తున్నాం.   పార్టీలకు అతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం నగదు బదిలీ కాకుంటే 1902 కాల్‌సెంటర్‌కు రైతులు ఫోన్‌ చేయవచ్చు ఎవరైనా పేరు లేకపోతే నమోదు చేసుకునేందుకునే అవకాశం రైతులకు ఎలా మేలు చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం రైతులకు నష్టం లేకుండా కౌలు చట్టాన్ఇన తీసుకువచ్చాం ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తాం రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతాం. ఆర్‌బీకే ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సలహాలు అందిస్తాం ఆర్‌బీకే ద్వారా భూసార పరీక్షలు చేస్తాం వ్యవసాయం, రైతు భరోసా కేంద్రాలకు ప్రత్యేంగా జాయింట్‌ కలెక్టర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. రైతు భరోసా కేంద్రాల్లో 3 రకాల ల్యాబ్‌లు ఉంటాయి. నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ల్యాబ్‌లు ఉంటాయి ఈ-క్రాపింగ్‌ ద్వారా పంట రుణాలు ఇప్పించేలా చర్యలు ఆర్‌బీకే ద్వారా రైతుల పంటలకు ఇన్సురెన్స్‌  గిట్టుబాటు ధర కల్పించడంలో ఆర్‌బీకేలు కీలక పాత్ర పోషిస్తాయి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నాం పొగాకు సమస్య వస్తే వెంటనే మంత్రి కన్నబాబును పంపించి పరిష్కరించాం స్థానికంగానే రైతుల పంటలకు మార్కెంటింగ్‌ అవకాశం కల్పిస్తాం. ఇప్పుడు ఖరీఫ్‌లో నష్టం జరిగితే రబీలో ఇన్సూరెన్స్‌ అందేలా చర్యలు గతంలో పంట నష్టం జరిగితే వెంటనే రైతులకు పరిహారం అందించాం రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు..మిగిలిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది వచ్చే ఏడాది చివరికల్లా వైయస్‌ఆర్‌ జనతా బజార్లు ఏర్పాటు సాగు పరిస్థితులపై రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. పగటి పూటే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు 82 శాతం ఫీడర్లను సిద్ధాం చేశాం రబీ నాటికి అందుబాటులో మిగిలిన 18 శాతం ఫీడర్స్‌ సిద్ధం చేస్తాం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం రూ.1500 కోట్లతో ఇప్పటికే రైతుల నుంచి పంట కొనుగోలు చేశాం కరోనా సమయంలోనే వెయ్యి కోట్లు మార్కెంటింగ్‌ జరిగింది. గత ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న 436 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చాం. ఆత్మహత్య చేసుకున్న పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచాం ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురవాలని,ప్రతి రైతు ముఖంలో ఆనందం చూడాలని ఆశిస్తున్నాను. రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుతున్నాను.

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం డీఎస్పీ ఆత్మహత్య

నెల్లూరు ,15.05.2020 పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ ✍ ఏపీ విశాఖ బీచ్‌ రోడ్డు ప్రాంతంలో ఓ పొలిసు ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకున్నారు . శ్రీకాకుళం స్పెషన్ డీఎస్పీ గా విధులు నిర్వహిస్తున్నకృష్ణ వర్మ తన ఇంట్లోనే ఉరి వేసుకొని బలవన్మరణానికి పాప్పడ్డారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యానంతో బాధపడుతూ సెలవుల్లో ఉన్నారు . శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పదేళ్ల పాటు సిఐ గా పనిచేసిన కృష్ణ వర్మ డీఎస్పీగా ప్రమోట్ అయ్యారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి నాలుగో విడత రేషన్ పంపిణీ

నెల్లూరు,15.05.2020 పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍ ఏపీలో రేపటి నుంచి 4వ విడత ఉంచిత రేషన్ పంపిణీ కార్యక్రమం మొదలుకానుంది. రాష్ట్రంలో మొత్తం కోటి 48 లక్షల 5,879 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం,కేజీ శనగలను ప్రభుత్వం ఇవ్వనుంది.రేషన్ కార్డుదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయగా, పోర్టబులిటి ద్వారా ఎక్కడ ఉంటే అక్కడ రేషన్ తీసుకునే వెసులుబాటు కలనించింది. రేషన్ తీసుకునేందుకు షాపుల వారీగా టైం స్లాట్ కేటాయించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.