భద్రాద్రి కొత్తగూడెం:- 19/09/2026 పున్నమి ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్ల రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయి. సుమారు రూ.30 కోట్ల ప్రభుత్వ నిధులతో ఈ రెండు బస్టాండ్లను కార్పొరేట్ లుక్లో పునర్నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక శౌచాలయాలు, మంచి నీటి ప్లాంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయనున్నారు. బస్సుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా విశాలమైన ప్లాట్ఫారమ్లు, డిజిటల్ డిస్ప్లే బోర్డులను అమర్చనున్నారు.
ఈ నూతన నిర్మాణాలతో జంట పట్టణాల అందం పెరగడమే కాకుండా, ప్రతిరోజూ ప్రయాణించే వేలాది మంది ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభూతి లభిస్తుంది. కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలతో ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.


