విశాఖపట్నం: గాజువాక మండలం కూర్మాన్నపాలెం, రాజీవ్ నగర్ ప్రధాన రహదారిపై వీధి కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారి పక్కన ఖాళీ స్థలంలో 8 నుండి 10 వరకు వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయని, వాహనదారులు, చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.
ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో కుక్కలు వెంటపడుతున్నాయని, పలువురిపై దాడికి యత్నించాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై చెత్త వేయడం వల్ల కుక్కలు అక్కడే ఉంటున్నాయని అంటున్నారు.
దీనిపై జీవీఎంసీ అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని, పట్టుకొని షెల్టర్ కు తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


