సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శాంతి కమిటీలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శోభాయాత్ర, నిమజ్జనం సమయంలో నిర్ణయించిన మార్గాలు, సమయాలను తప్పనిసరిగా పాటించాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. పోలీసు, నగరపాలక, అగ్నిమాపక, నీటిపారుదల, వైద్య, విద్యుత్, రవాణా శాఖల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో గేంటెల విద్యాసాగర్, జయపాల్ రెడ్డి లాహోటి, రుద్ర ప్రదీప్, అల్లిక అంజయ్య, ఇన్స్పెక్టర్లు మోహన్ బాబు, బాలకృష్ణ, భానుప్రకాష్ పాల్గొన్నారు.



