పున్నమి న్యూస్ మాచర్ల ప్రతినిధి | ఆగస్టు 26:
మాచర్ల మండలంలోని పసువేముల గ్రామంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై విచారణలు నిర్వహించారు. గ్రామస్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు, రెవెన్యూ సంబంధిత సమస్యలను పరిశీలించి వివరాలను నమోదు చేశారు.
సంబంధిత సమస్యలపై సమగ్రంగా విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


