ఖమ్మం: గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల వివరాలను నిర్వాహకులు ముందుగానే తెలంగాణ పోలీస్ అధికారిక పోర్టల్ policeportal.tspolice.gov.inలో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. మండప నిర్వాహకులు, కమిటీ సభ్యులు, మండప ప్రాంతం, నిమజ్జన వాహనాలు తదితర వివరాలను పోర్టల్లో నమోదు చేయాలన్నారు. 2026 గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపునకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉందన్నారు. మండపాల వివరాలు ముందుగానే అందుబాటులో ఉండటంతో ప్రాంతాల వారీగా పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన మార్గాలు, భద్రతా చర్యలను సమర్థవంతంగా ప్రణాళిక చేయవచ్చన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.



