*_పశ్చిమ ఇబ్రహీంపట్నంలో అట్టాసంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు_*
_ముఖ్య అతిథిగా పాల్గొన్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు_
ఇబ్రహీంపట్నం,
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పశ్చిమ ఇబ్రహీంపట్నంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అట్టాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ మరియు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, టిడిపి పట్టణ కార్యదర్శి రావి ఫణి హాజరయ్యారు. ఈ సందర్భంగా పండితులు శ్రీకృష్ణుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఆ కృష్ణుడి దయతో అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు కలగాలని వేడుకున్నట్లు చైర్మన్ తెలిపారు.




