భద్రాచలం కేంద్రంగా త్రివిధ చికిత్సా విధానాలు, మూలికా వైద్యం, గ్రామీణ ఆరోగ్య సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర స్థాయి పారంపర్య వైద్యుల మహాసభలు సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 మంది వైద్యులు హాజరుకానున్నారు. మహాసభల ఏర్పాట్లపై స్థానిక నిర్వాహకులు, వైద్య సంఘ ప్రతినిధులు సమావేశమై చర్చించారు.పారంపర్య వైద్య మహా సంఘం (పివిఎంఎస్) రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘ రాష్ట్ర సలహాదారు మొక్కల వెంకటయ్య, ఉపాధ్యక్షులు వైద్య రా మంచి శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ వైద్య సుగుణారావులు విజ్ఞప్తి చేశారు.ఆదివారం ఎస్పీబీ నగర్ లోని మొక్కల వెంకటయ్య ప్లాంటేషన్ లో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. భారతీయ సనాతన సాంప్రదాయ వైద్యంలోని మెలకువలను, మూలాలను, విజ్ఞానవంతుల అనుభవాలను ఇతరులకు నేర్పించే నిరంతర వైద్య విజ్ఞాన సదస్సులో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.శ్రీ సీతారాముల సన్నిధి భద్రాచలంలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో జరిగే ఈ మహాసభలకు 400 మంది వైద్యులు హాజరవుతారని తెలిపారు.భక్త మార్కండేయ పద్మశాలి భవన్ లో జరుగనున్న ఈ సభలకు ముఖ్య అతిథులుగా శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామీజీ, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వైద్య శ్రీ జమాల్ ఖాన్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు వైద్య దొంత యాతి మహర్షి ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు, కోశాధికారులు టి.దుర్గారాణి, వి.అరుణలతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్, హరిత దీక్షురాలు చిన్నారి నైనిక రజువ, సభ్యులు వైద్య వీర్ల నరసింహారావు(లక్ష్మీదేవిపల్లి – కొత్తగూడెం), ఎండి ముస్తఫా, శంకర్ బంగారి, రాయి లక్ష్మి, దశరథ్ రజువ, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం నుంచి పారంపర్య వైద్యుల రాష్ట్ర మహాసభలు భద్రాచలంలో సెప్టెంబర్ 8–10 వరకు
భద్రాచలం కేంద్రంగా త్రివిధ చికిత్సా విధానాలు, మూలికా వైద్యం, గ్రామీణ ఆరోగ్య సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర స్థాయి పారంపర్య వైద్యుల మహాసభలు సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 మంది వైద్యులు హాజరుకానున్నారు. మహాసభల ఏర్పాట్లపై స్థానిక నిర్వాహకులు, వైద్య సంఘ ప్రతినిధులు సమావేశమై చర్చించారు.పారంపర్య వైద్య మహా సంఘం (పివిఎంఎస్) రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘ రాష్ట్ర సలహాదారు మొక్కల వెంకటయ్య, ఉపాధ్యక్షులు వైద్య రా మంచి శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ వైద్య సుగుణారావులు విజ్ఞప్తి చేశారు.ఆదివారం ఎస్పీబీ నగర్ లోని మొక్కల వెంకటయ్య ప్లాంటేషన్ లో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. భారతీయ సనాతన సాంప్రదాయ వైద్యంలోని మెలకువలను, మూలాలను, విజ్ఞానవంతుల అనుభవాలను ఇతరులకు నేర్పించే నిరంతర వైద్య విజ్ఞాన సదస్సులో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.శ్రీ సీతారాముల సన్నిధి భద్రాచలంలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో జరిగే ఈ మహాసభలకు 400 మంది వైద్యులు హాజరవుతారని తెలిపారు.భక్త మార్కండేయ పద్మశాలి భవన్ లో జరుగనున్న ఈ సభలకు ముఖ్య అతిథులుగా శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామీజీ, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వైద్య శ్రీ జమాల్ ఖాన్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు వైద్య దొంత యాతి మహర్షి ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు, కోశాధికారులు టి.దుర్గారాణి, వి.అరుణలతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్, హరిత దీక్షురాలు చిన్నారి నైనిక రజువ, సభ్యులు వైద్య వీర్ల నరసింహారావు(లక్ష్మీదేవిపల్లి – కొత్తగూడెం), ఎండి ముస్తఫా, శంకర్ బంగారి, రాయి లక్ష్మి, దశరథ్ రజువ, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

